News

జనవరి మొదటి వారం నుంచి ఉద్యమం


ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ ఎస్సీల వర్గీకరణ చేస్తానని చెప్పి మాదిగలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. జనవరి మొదటి వారం నుంచి ఎస్సీల వర్గీకరణకు ఉద్యమం చేపట్టనున్నట్లు చెప్పారు. రిజర్వేషన్‌లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు చెబుతున్నా కాపులను బీసీల్లో చేరుస్తామంటున్నారని, మాదిగలకు ఇచ్చిన హామీ ఏమైందో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.